Sanju Samson Fans: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 5th T20I) మధ్య చిట్ట చివరి టీ20 మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. కేరళలోని తిరువనంతపురం ( Thiruvananthapuram) వేదికగా ఈ ఐదవ టి20 జరగనుంది. ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ( Greenfield International Stadium, Thiruvananthapuram) వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ( Sanju Samson) సొంతూరు తిరువనంతపురమే. దీంతో ఆ నగరంలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా రేపు ఆడబోతున్నాడు సంజు శాంసన్. అయితే ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో అతనికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు సంజు శాంసన్ అభిమానులు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 5th T20I) మధ్య గ్రీన్ ఫీల్డ్ వేదికగా ఐదవ టి20 మ్యాచ్ రేపు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. సంజు శాంసన్ సొంతూరు తిరువనంతపురం కావడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీని అంతటికి కారణం ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడతాడని నమ్మకం. అయితే ప్రస్తుత గణాంకాల నేపథ్యంలో తుది జట్టులో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
అయితే తుది జట్టులో సంజు శాంసన్ కు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం లోకల్ అభిమానులు అస్సలు ఊరుకోరు. గౌతమ్ గంభీర్ కు దండేసి దండం పెట్టడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఐదవ టి20 లో ఖచ్చితంగా సంజు శాంసన్ ఆడాల్సిందేనని వెల్లడిస్తున్నారు. ఒకవేళ సంజు శాంసన్ కు చోటు ఇవ్వకుండా వేరే ప్లేయర్ కు అవకాశం ఇస్తే గౌతమ్ గంభీర్ పేగులు తీసి మెడలో వేసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే తిరువనంతపురం వచ్చిన టీమిండియా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్. అటు సూర్య కుమార్ యాదవ్ కూడా.. సంజు భాయ్ వస్తున్నాడు జరగండి అంటూ విమానాశ్రయంలో హడావిడి కూడా చేశాడు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మరియు జస్ప్రీత్ బుమ్రా.