Security Check PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు ( Pakistan team) ఘోర అవమానం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించిన లగేజ్ బ్యాగులను, క్రికెట్ కిట్లలను శ్రీలంక పోలీసులు ( Srilanka Police) చెక్ చేసినట్లు షాకింగ్ కథనాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( team india vs pakistan) మధ్య శివరాత్రి రోజున గ్రూప్ స్టేజిలో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు కొలంబోలో పాకిస్తాన్ ప్లేయర్ల బ్యాగులను ( Pakistan team bags ) శ్రీలంక పోలీసులు చెక్ చేసినట్లు చెబుతున్నారు. స్నిఫర్ డాగ్స్ స్టేడియంను తనిఖీ ( Security Check PAK) చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ముందు తెలియదు కానీ.. ఈ విషయం ప్రపంచ క్రీడ రంగాన్ని కుదిపేస్తోంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ రోజున అద్భుతంగా రాణించిన టీమిండియా, గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో పాకిస్తాన్ బరువు అంతర్జాతీయంగా పోయిన సంగతి తెలిసిందే.
అయితే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు శ్రీలంక పోలీసులు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించిన బ్యాగులను శ్రీలంక పోలీసులు చెక్ చేసారట. ఇండియాతో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ నుంచి కీలక ఆదేశాలు వచ్చాయట. కచ్చితంగా పాకిస్తాన్ ప్లేయర్లను తనిఖీ చేయాలని.. వాళ్ళ బ్యాగ్స్ చూడాలని ఐసీసీ అధికారులు వెల్లడించారట.
ఇక ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించిన బ్యాగులను కొలంబో మ్యాచ్ కంటే ముందు శ్రీలంక పోలీసులు చెక్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద దేశం. అలాంటి దేశం నుంచి వచ్చే ప్లేయర్లు చాలా డేంజర్. దానికి తోడు టీమిండియా ప్లేయర్లు అంటే పాకిస్తాన్ కు అస్సలు పడదు. ఇలాంటి నేపథ్యంలో ఏదైనా జరిగే ప్రమాదం ఉందని ఐసీసీ ఇలా చేయించిందని అంటున్నారు.