E-Paper
Advertisement

Shahid Afridi on PCB: పాకిస్తాన్ ప‌రువును ఇండియాకు అమ్మేశారు..ఇక అంద‌రూ బావిలో దూకి, చావండి

Shahid Afridi on PCB: పాకిస్తాన్ ప‌రువును ఇండియాకు అమ్మేశారు..ఇక అంద‌రూ బావిలో దూకి, చావండి

Shahid Afridi on PCB:  T20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ మరో యూటర్న్ తీసుకుంది. మొన్నటి వరకు అసలు టోర్నమెంట్ ఆడబోమని డ్రామాలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆ తర్వాత టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఇండియా తో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కోసం మేము త్యాగం చేస్తున్నామని ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్. అయితే దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర నష్టం జరుగుతుందని icc గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దెబ్బకు దిగి రావాల్సి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అన్ని మూసుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు పాకిస్తాన్ సర్కార్ కూడా పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడంపై షాహిద్ ఆఫ్రీది హాట్ కామెంట్స్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడంపై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ చిల్లర వేషాలు వేస్తున్నారు.. ఆడితే ఆడండి, లేకపోతే మానేయండి.. ఇలా రెండు తలల పాములాగా నాటకాలు ఆడకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు షాహిద్ ఆఫ్రీది. ముందుగా ఇండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డ్రామాలు చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఐసీసీ బెదిరించగానే తోక ముడిచారని.. ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. ఇలా పాకిస్తాన్ పరువును ఇండియా కాళ్ల దగ్గర పెట్టారని.. డబ్బులకు పరువు అమ్మేశారని మండిపడ్డారు. ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు అమాంతం పోయిందని… అందరూ కలిసి బావిలో దూకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షాహిద్ ఆఫ్రీది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

చివరి క్షణంలో ఇండియాతో మ్యాచ్ కు సై అన్న పాకిస్తాన్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో ఆడబోమని.. మ్యాచ్ బహిష్కరిస్తామని పాకిస్తాన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చివరి క్షణంలో నిన్న అర్ధరాత్రి ఇండియా తో మ్యాచ్ ఆడెందుకు సిద్ధమైంది పాకిస్తాన్. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం కూడా ఆమోదించింది. ప్రధాని షరీఫ్ కూడా ఇండియాతో మ్యాచ్ ఆడండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఐసిసి కూడా అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

 

 

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×