Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తరహా లోనే వైదొలిగేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరి క్షణంలో చెబితే, బీసీసీఐ తో పాటు ఐసీసీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ దిశగానే పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ వైదొలిగితే, ఐసీసీ అలాగే బీసీసీఐ రెండు కూడా మోకాళ్లపై నిలబడి అడుక్కోవాల్సిందే అంటూ బాంబు పెంచారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో పాకిస్తాన్ కూడా బాయ్ కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది. ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ జట్టు అర్ధాంతరంగా బాయ్ కాట్ చేస్తే ఐసీసీ తో పాటు బీసీసీఐకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే బాయ్ కాట్ చేస్తే ఐసీసీ, బీసీసీఐ దిగి రావాల్సిందేనని పేర్కొన్నారు. మోకాళ్లపై కూర్చొని పాకిస్తాన్ ను ఐసీసీ అలాగే బీసీసీఐ వేడుకోవాల్సిందేనని.. పాకిస్తాన్ కచ్చితంగా ఈ టోర్నమెంట్లో ఆడేలా బతిలాడుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షాహిద్ ఆఫ్రీది. బంగ్లాదేశ్ జట్టుకు తీవ్ర అన్యాయం చేసింది ఐసీసీ అని ఫైర్ అయ్యారు. ఇండియాకు ఐసీసీ కొమ్ము కాస్తోందని నిప్పులు చెరిగారు. అందుకే ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసే ఛాన్సులు ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) నుంచి నిజంగానే పాకిస్తాన్ తప్పుకుంటే, బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు ఐస్ ల్యాండ్ క్రికెట్ జట్టు కూడా సిద్ధంగా ఉందట. కాగా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడటంపై జనవరి 30 అంటే రేపు లేదా ఫిబ్రవరి 2వ తేదీన నిర్ణయం తెలుపునుంది పాకిస్తాన్.
https://www.facebook.com/share/p/1dmHWkfaWz/