E-Paper
Advertisement

Shoaib Akhtar : మిస్ట‌ర్ కోహ్లీ..నువ్వు మగాడివే అయితే 200 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు చేయ్

Shoaib Akhtar : మిస్ట‌ర్ కోహ్లీ..నువ్వు మగాడివే అయితే 200 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు చేయ్

Shoaib Akhtar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గాయాలు అలాగే వైరల్ ఫీవర్ సోకినప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ అవతారం ఎత్తి పరుగులు సాధిస్తున్నాడు విరాట్ కోహ్లీ ( virat kohli ). అయితే ఇంత కష్టపడుతున్న విరాట్ కోహ్లీని టెస్ట్ ప్లేయర్ అంటూ పరువు తీస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఐపీఎల్ టోర్నమెంటులో టెస్ట్ ప్లేయర్ లాగా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. విరాట్ కోహ్లీ మగాడైతే, 200 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేయాలని సవాల్ విసిరాడు షోయబ్ అక్తర్. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్ గా విరాట్ కోహ్లీ..అయినా విమ‌ర్శ‌లే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB Team) అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన బెంగుళూరు… మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ విక్టరీ అందుకుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లో విజయం సాధించిన బెంగుళూరు రెండో స్థానంలో నిలిచింది. దానికి తగ్గట్టుగానే, విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఐదు మ్యాచ్ ల‌లో మొత్తం 228 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఇందులో విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోరు 69. ఈ ఐదు మ్యాచ్ ల‌లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 158.33 మాత్రమే. ఎక్కడ కూడా 200 దాటలేదు. దీంతో విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ పెద్ద ప్లేయర్ అయినప్పటికీ కూడా టీ20 లలో స్లోగా బ్యాటింగ్ చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నువ్వు మగాడివే అయితే 200 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు చేయ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సవాల్ విసిరారు. విరాట్ కోహ్లీ కి దమ్ముంటే.. 200 స్ట్రైక్ రేటుతో ఐపీఎల్ లో పరుగులు చేయాలని చాలెంజ్ చేశారు. అలా 200 స్ట్రైక్ రేట్ సాధించకపోతే ఐపిఎల్ నుంచి తప్పుకోవాలని కూడా చురకలు అంటించారు. ఇలా స్లోగా బ్యాటింగ్ చేసిన‌ప్ప‌టికీ, విరాట్ కోహ్లీని బెంగ‌ళూరు భ‌రిస్తోంద‌ని ప‌రువు తీశారు అక్త‌ర్‌.

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×