E-Paper
Advertisement

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు
Advertisement

Delhi: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజశ్విసూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కచ్చితంగా సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.

తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హాట్ కామెంట్స్

Advertisement

శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు ఎంపీ మాటలను రికార్డులను తొలగించాలని, అలాగే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు ఎంపీ మాటలను రికార్డులను తొలగించాలని, అలాగే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి. తెలంగాణ గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎలాంటి అవగాహన ఉందని మాట్లాడారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1600 మంది బలి దానాలు, నీళ్లు, నిధులు, నియామకాలు వంటి నినాదంతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడం ఏంటని ప్రశ్నించారు.

ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. కచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ఆయనకు మద్దతుగా మాట్లడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు వెనుకేసికొచ్చారని ప్రశ్నించారు.

ALSO READ: మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు గెలిపించడం వల్లే జరిగిందన్నారు. పార్టీ ఎంపీని మందలించకుండా ఆయన్ని వెనుకేసురావడం ఏంటంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో బీఆర్ఎస్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఎంపీ మాట్లాడిన సమయంలో సభలో తాము లేమని చెప్పడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ. కావాలనే బీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతోందని విమర్శించారు.

అటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తేజస్వి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు కాంగ్రెస్ ఎంపీలు.

 

Related News

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

Big Stories

Advertisement
×