SRH Fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) సరికొత్త వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Rajasthan Royals vs Hyderabad) జట్ల మధ్య మొన్న ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన సందర్భంగా తెలంగాణ మ్యాప్ ను లేజర్ ద్వారా వేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం తెలంగాణ వాళ్లకు సంబంధించినది అనే అర్థం వచ్చేలా లేజర్ షో వేశారు. దీంతో వివాదం రాజుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం తెలంగాణకు సంబంధించినదేనని… ఏపీకి చెందినది కాదంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ లేజర్ షో వేయించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) యాజమాన్యంపై సీరియస్ అవుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటన హాట్ టాపిక్ అయింది.
Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్కడ స్టేడియాలపైనే బాంబులు పడతాయి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది. రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయినప్పటికీ.. ఈ 12 సంవత్సరాల పాటు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఎలాంటి గొడవ తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య జరగలేదు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాసులు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక్క తప్పిదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగిన నేపథ్యంలో SRH టీమ్ కేవలం తెలంగాణకు సంబంధించింది అన్నట్లుగా మ్యాప్ ప్రదర్శించారు.
SRH లోగోతో పాటు తెలంగాణ మ్యాప్ ను లేజర్ షో ద్వారా ప్రదర్శించింది హైదరాబాద్ యాజమాన్యం. ఈ సంఘటన ఏపీ అభిమానులకు కోపం తెప్పించింది. SRH తమ జట్టు అని భావిస్తున్న తమను కించపరిచేలా ఈ లేజర్ షో ప్రదర్శించారని ఏపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక SRH జట్టును ఏపీ వాసులు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. SRH స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ జట్టుతో మనకు సంబంధం తెగిపోయిందని అంటున్నారు.
అటు తెలంగాణకు సంబంధించిన క్రికెట్ అభిమానులు కూడా తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఏపీకి సంబంధించిన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను అభిమానిస్తారని.. వాళ్లకు SRH జట్టు అంటే అస్సలు పడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు లేజర్ షో తగిన బుద్ధి చెప్పిందని కావ్య పాపను మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ లేజర్ షో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకుగాను కావ్య పాపపై దేశద్రోహి ముద్ర పడింది. ఇక ఇప్పుడు తెలంగాణ అలాగే ఏపీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కావ్య పాపను ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: Ahmed Shehzad: PSLలో వార్నర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయర్లు తప్ప, ఎవడూ మిగలలేదు
Telugu team support cheyandi antaru Telangana map vestharu, Mari Andhra vallu andaru EP la?
AP lo support chesevallandariki siggu undali idi chusipic.twitter.com/9TzBKQJEyE— Anandi🧚🏻♀️ (@lilmissAnandi) April 16, 2026
అప్పట్లో చెన్నై వాళ్ళు మెడ పట్టి నూకిన్రు 😂
మొన్న మా KCR ఉరికిచ్చిండు 🤭😄
ఇప్పుడు SRH
ఏందో పాపం మీ బతుకు 😂
— Dr. Amritha Reddy 🪴 🌴 (@amritha_reddy25) April 16, 2026