Shoaib Akhtar: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ లు పాకిస్తాన్ బాయ్ కాట్ ( Pakistan’s boycott drama) చేయడంపై మరోసారి ఆ దేశానికి చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చాలా సీరియస్ అయ్యారు. ఇక ఆ పాకిస్తాన్ చెత్త నా కొడుకుల గురించి తన దగ్గర ప్రస్తావించకూడదని వెల్లడించారు. వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదని.. ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడడం గ్యారంటీ అని హెచ్చరించారు షోయబ్ అక్తర్. ఇకపై పాకిస్తాన్ క్రికెట్ గురించి డిబేట్ లలో తనను అడగకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కూడా దండగే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు రోజుకో నాటకం ఆడుతోంది. మొట్టమొదట ఈ టోర్నమెంట్లో ఆడబోమని…బహిష్కరిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆడతామని కొలంబోకు వచ్చింది. కొలంబోకు రాగానే టీమిండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ సర్కారు ప్రకటన చేసింది. అయితే దీనిపై పునరాలోచన చేసుకోవాలని పాకిస్తాన్ కు సూచనలు చేసిందట ఐసీసీ. ఈ నేపథ్యంలో స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ కోసం ఇండియాతో మ్యాచ్ ఆడబోమని వెల్లడించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని అంతటికి కారణం భారత దేశం అంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ కోసం అండగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు షరీఫ్.
అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పాకిస్తాన్ క్రికెట్ గురించి లైవ్ డిబేట్ లో తనను అడగకండి అని తేల్చి పారేశారు. ఓ లైవ్ డిబేట్ లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ… ఎంత చెప్పినా పాకిస్తాన్ వినడం లేదని ఫైర్ అయ్యారు. ఇండియాకు పాకిస్తాన్ తో ఎలాంటి అవసరం లేదు.. కానీ పాకిస్తాన్ కు మాత్రం ఇండియా అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ విషయం గ్రహించకుండా బహిష్కరణ చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. ఇకపై లైవ్ డిబేట్ లలో పాకిస్తాన్ గురించి మాట్లాడబోనని.. ఆ పిచ్చి నా కొడుకుల గురించి మాట్లాడడం దండగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అనలిస్టుగా మాట్లాడితే తనకు డబ్బులు వస్తాయి అందుకు మాట్లాడుతున్నాను తప్ప.. పాకిస్తాన్ అంటే ప్రేమ లేదన్నారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
🚨 Shoaib Akhtar got angry about Pakistan's boycott drama against India.
– I'm not interested in talking about Pakistan cricket; I just came here to talk about it because I was requested, and I'm getting money. I don't want to waste my time in talking about PCB. pic.twitter.com/W64KH2o9F0
— Tejash (@Tejashyyyyy) February 4, 2026