Shoaib Malik: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నేళ్లుగా తన ఆట కంటే వివాదాల కారణంగానే తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్. వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటి.. 2010లో ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగ బిడ్డ కూడా జన్మించాడు. అయితే సానియా మీర్జా కంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఆమెతో ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయాడు. ఆయేషా సిద్ధిఖీ అనే అమ్మాయిని రహస్యంగా వివాహమాడాడు షోయబ్ మాలిక్. ఆమె నుండి విడిపోయిన షోయబ్ మాలిక్.. ఆ వెంటనే సానియా మీర్జాని వివాహం చేసుకున్నాడు.
Also Read: CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్
సానియా మీర్జాతో కూడా విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు. 2024లో ఈ జంట విడాకులు తీసుకుంది. 14 సంవత్సరాల దాంపత్య బంధానికి 2024లో విడాకులతో ముగింపు పలికింది ఈ జంట. ఆ తర్వాత 2024లో సనా జావెద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తరచుగా ఇతర మహిళలతో అఫై** పెట్టుకోవడం వల్లనే సానియా మీర్జా విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు మాలిక్ సోదరి ఓ సంచలన విజయాన్ని బయటపెట్టింది. ఇక షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న మూడవ అమ్మాయి సనా జావెద్ కి కూడా ఇది రెండవ వివాహం. ఈమె కూడా మాలిక్ ని పెళ్లి చేసుకునేందుకు ముందు తన పాత బంధాన్ని తెంచుకుంది. అయితే ఈ వివాహం జరిగి కేవలం ఏడాదిన్నర కాకముందే ఈ బంధం కూడా విడిపోయిందనే పుకార్లు మొదలయ్యాయి.
సానియా మీర్జాతో 2024లో విడాకుల అనంతరం పాకిస్తాన్ హీరోయిన్ సనా జావెద్ ని పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. ఆ తర్వాత కొంతకాలానికే తమ హ్యాపీ లైఫ్ కి చెక్ పెట్టబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు జోరుగా సాగాయి. అంతేకాకుండా ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయని.. ఇక ప్రస్తుతం షోయబ్ మాలిక్.. సోనియా అనే అమ్మాయితో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు పాకిస్తాన్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త విషయాలను బహిర్గతం చేసింది సానియా మీర్జా. ఓ యూట్యూబ్ షో లో మాట్లాడుతూ.. షోయబ్ మాలిక్ తో విడాకుల అనంతరం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి ప్రస్తావించింది. విడాకుల అనంతరం భయానక పరిస్థితులలో గడుపుతున్న తనకు.. ఫరా అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత భావోద్వేగ భరితమైనవిగా గుర్తుచేసుకుంది. ఆరోజు తాను పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉన్నానని.. ఫరా వచ్చి ధైర్యం చెప్పినప్పుడు తనకు బలం వచ్చిందని భావోద్వేగానికి గురైంది.
Also Read: Ind vs Sa 1st Test: తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే
ఇక సానియా మీర్జా కి విడాకులు ఇచ్చి.. మూడవ పెళ్లి చేసుకోవడంపై గత ఏడాది షోయబ్ మాలిక్ పరోక్షంగా మాట్లాడాడు. ” ప్రజల గురించి కాకుండా, మనసుకు నచ్చినట్లు నడుచుకోవాలి. మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో అని ఎప్పటికీ ఆలోచించకూడదు. జనాలు అర్థం చేసుకోవడానికి పదేళ్లు లేదా 20 ఏళ్లు సమయం కూడా పడుతుంది. అప్పటివరకు మనం ఏం చేయకుండా ఆగిపోలేము కదా ” అని అన్నాడు.