E-Paper
Advertisement

Ban On Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్‌.. శ్రేయాస్ అయ్యర్ పై నిషేధం !

Ban On Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్‌.. శ్రేయాస్ అయ్యర్ పై నిషేధం !

Ban On Shreyas Iyer:  పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer) వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టును గెలిపిస్తున్నప్పటికీ, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు వరుసగా ఫైన్లు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్ లు ఆడగా.. రెండిట్లోనూ అయ్యర్ పైన ఫైన్ పడింది. ఈ నేపథ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఫైన్ పడితే మాత్రం ఒక మ్యాచ్ ( Ban On Shreyas Iyer) ఆడకుండా నిషేధం విధించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

శ్రేయాస్ అయ్యర్ పై నిషేధం !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదటిసారి స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. దీంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు భారీ జరిమానా విధించింది బీసీసీఐ. దాదాపు రూ.12 లక్షల జరిమానా విధించారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో కూడా స్లో ఓవర్ రేటు నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ పైన రూ.24 లక్షల జరిమానా విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయ్యర్ తో పాటు జట్టులో ఉన్న సభ్యులందరిపైన ఫైన్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఈ శిక్షకు అర్హుడే. అంటే శ్రేయాస్ అయ్యర్ పైన రూ. 24 లక్షల ఫైన్ వేసిన బీసీసీఐ, పంజాబ్ కింగ్స్ లోని ప్లేయర్లంద‌రి పైన ఆరు లక్షల చొప్పున ఫైన్ విధించారు. రూ. 6 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రూల్స్ ప్ర‌కారం ముచ్చ‌ట‌గా మూడోసారి ఫైన్ ప‌డితే, మాత్రం ఒక మ్యాచ్ ఆడ‌కుండా నిషేధం అయ్య‌ర్ పైన ప‌డ‌నుంది. ఇదే జ‌రిగితే, పంజాబ్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ రావాల్సి ఉంటుంది. శ్రేయాస్ అయ్య‌ర్ పై నిషేధం విధిస్తే, శశాంక్ సింగ్ తాత్క‌లికంగా కెప్టెన్ అవుతాడు.

పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. గుజరాత్ టైటాన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయాలు నమోదు చేసుకుంది పంజాబ్ కింగ్స్. దీంతో నాలుగు పాయింట్లు సంపాదించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

 

 

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×