Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 17వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను వారం రోజుల కిందట ఆపేశారు. ఇక ఇప్పుడు ఈ టోర్నమెంట్ను మళ్లీ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ ( Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… జరగబోయే మిగిలిన మ్యాచ్ లలో చీర్ గర్ల్స్ ( Cheer Girls) డాన్స్ ఉండకూడదని… బాంబు పేల్చారు.
ALSO READ: MI’s 4th IPL Title: కాలుకు 7 కుట్లు..రక్తం కారుతోంది..అయినా ముంబైపై వాట్సన్ వీరోచిత బ్యాటింగ్
ఇకపై చీర్ గర్ల్స్ పైన బ్యాన్ ?
ఐపీఎల్ 2025 టోర్నమెంటు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి కి ( Board of Control for Cricket in India )… కీలక సూచనలు చేశారు సునీల్ గవాస్కర్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan ) మధ్య యుద్ధం నేపథ్యంలో చాలామంది సైనికులు వీర మరణం పొందారు… వాళ్లకోసం మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు సునీల్ గవాస్కర్. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు… మనం ధైర్యం నింపాలి. వాళ్ల మనోభావాలను గుర్తించాలి. వీర జవానులకు నివాళులర్పించాలి అని వివరించాడు.
దానికోసం ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లలో…. చీర్ గర్ల్స్ లేకుండా పేర్కొన్నాడు సునీల్ గవాస్కర్. అలాగే డిజె సౌండ్లు, సెలబ్రేషన్స్ లాంటివి అస్సలు చేయకూడదని.. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరారు సునీల్ గవాస్కర్. అలా చేస్తేనే.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల మరణానికి అర్థం ఉంటుందని వివరించాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ఇప్పటికే 60 కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి… మరో 17 మ్యాచ్లు మాత్రమే జరుగుతాయి… కాబట్టి ఈ 17 మ్యాచ్లలో సెలబ్రేషన్స్ జరగకూడదని విజ్ఞప్తి చేశాడు. అయితే సునీల్ గవాస్కర్ చేసిన ఈ విజ్ఞప్తిపై… భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మే 17వ తేదీ నుంచి పున : ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ మే 17వ తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు కొనసాగుతుంది. అంటే మే 25వ తేదీన జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ జూన్ మూడవ తేదీన జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరార్ అయింది.