T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కు టీమిండియా స్క్వాడ్ను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. కాగా హార్ధిక్ పాండ్యాకు చోటు లభిస్తుందా లేదా అనే వార్తలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ఆల్ రౌండర్ కోటాలో హార్ధిక్ పాండ్యా, శివమ్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్కు చోటు లభించింది. ఇక వికెట్ కీపర్ల లిస్ట్ లో రిషబ్ పంత్, సంజూ శాంసన్ కు చోటు లభించింది. కాగా గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ రిజర్వ్ లిస్ట్ లో ఉన్నారు.
భారత T20 ప్రపంచ కప్ 2024 జట్టు: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), హార్దిక్ పాండ్యా (VC), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024