BigTV English
Advertisement

Kejriwal’s health is fine, Says Punjab CM: జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఆ మాట విని ఎంతో సంతోషించారంటా!

Kejriwal’s health is fine, Says Punjab CM: జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఆ మాట విని ఎంతో సంతోషించారంటా!

Arvind Kejriwal’s health is fine, Says Punjab Chief Minister: ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలా సంతోషించారంటా. పంజాబ్ ముఖ్యమంత్రి ఆయనను జైలులో కలిసి ఓ విషయాన్ని తెలియజేయగా ఆయన ఎంతోగానో ఆనందపడ్డారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయనతో ప్రస్తావించిన పలు అంశాల గురించి కూడా ఆయన తెలియజేశారు.


అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలిశారు. కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఆరోగ్యగంగా ఉన్నారని తెలిపారు. ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తన అరెస్ట్ విషయమై ఆందోళన చెందొద్దని.. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారని.. అదేవిధంగా లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు చురుగ్గా ప్రచారం చేయాలని తమకు సూచించారని భగవంత్ మాన్ తెలిపారు.

ఇటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి కూడా తనను అడిగారని.. ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని తాను కేజ్రీవాల్ కు చెప్పగా.. ఆ మాట విన్న కేజ్రీవాల్ ఎంతో సంతోషించారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల గుజరాత్ పర్యటనకు సంబంధించిన అంశాన్ని కూడా కేజ్రీవాల్ తో చర్చించినట్లు తెలిపారు. కేజ్రీవాల్ జైలులో ఉండడగా ఆయనను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలవడం ఇది రెండోసారి.


Also Read: కర్ణాటకలో తీవ్ర దుమారం.. కీలక నిర్ణయం తీసుకున్న జేడీఎస్

ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా.. కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 1 వరకు విధించడంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన తరఫున, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రచారం నిర్వహించనున్నారని ఆప్ పార్టీ నేతలు తెలిపిన విషం విధితమే.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×