Tanveer Ahmed: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐర్లాండ్ తో ఆడినట్లుగానే.. మనోళ్లు ఇంగ్లాండులోనూ అదే చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా… వరుసగా రెండు టీ20లో ఓడిపోయింది టీమిండియా. నిన్న నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 జరిగింది. ఇందులో 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అయిన టీమిండియా… 125 పరుగుల తేడాతో అత్యంత ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా టీమిండియా ప్రదర్శన పై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) కూడా స్పందించారు. టీమిండియాను హేళన చేస్తూ మాట్లాడారు. 76 పరుగులకు ఆలౌట్ కావడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా వాళ్ల కోసం ఐపీఎల్ తరహాలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయిన పెట్టండి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో మనోళ్లు చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిపోయింది టీమిండియా. ఒక్క మ్యాచ్ లో కూడా 200 కొట్టలేక సతమతమవుతున్న టీమిండియా… మూడవ టి20లో 76 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్ లో తప్ప.. విదేశీ మైదానాలలో ఆడలేరని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ చేతిలో ఐర్లాండ్ తరహాలో టీమిండియా మరోసారి వైట్ వాష్ కావడం గ్యారంటీ అని కుండబద్దలు కొట్టి చెప్పారు.
అలా కాకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని శపథం కూడా చేశారు. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా 76 పరుగులకే ఆల్ అవుట్ అయిందని ఫైర్ అయ్యారు. అలాంటి టీమిండియా కోసం ఐసీసీ కొత్త రూల్స్ తీసుకురావాలని హేళన చేశారు. ఐపీఎల్ తరహాలోనే అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఇంపాక్ట్ రూల్ తీసుకురావాలని సరికొత్త డిమాండ్ చేశారు. అప్పుడైనా టీమిండియా 10 వికెట్లు కోల్పోతే… ఆ ఇంపాక్ట్ ప్లేయర్, జట్టును లీడ్ చేస్తాడని… సెంచరీ దాటేలా కాపాడుతాడని సెటైర్లు పేల్చారు. ఆ దిశగా ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షా చర్యలు తీసుకోవాలంటూ చురకలు అంటించారు.