Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ అలాగే ఇండియన్ క్రికెటర్లను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఇండియన్ క్రికెటర్లు తమ బ్యాట్లలో రబ్బర్లు వాడుతున్నారని పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఇండియన్ క్రికెటర్లు కొట్టిన ప్రతి బంతి స్టేడియం అవతల పడుతోందని.. దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోందని సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతున్నా కూడా ఐసీసీ (ICC) మాత్రం చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదని బండి పడ్డారు. వెంటనే ఇండియన్ క్రికెటర్ల బ్యాట్లను చెక్ చేయాలని.. లేకపోతే బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు దుమారం రేపుతున్నాయి.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు నిత్యం ఇండియాపై విషం కక్కుతూనే ఉంటారు. పొద్దున్నే లేస్తే చాలు, ఇండియన్ క్రికెటర్లను అలాగే ఐపీఎల్ టోర్నమెంట్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెటర్స్ ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్లు బ్యాట్లలో రబ్బర్లు వాడుతున్నారని బాంబు పేల్చాడు. దీని వల్ల సిక్సర్లు, బౌండరీలు అవలీలగా కొడుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రబ్బర్లు ఉన్న బ్యాట్లు చాలా మంది ఇండియన్ క్రికెటర్లు వాడుతున్నారని తెలిపారు. అందుకే ఇండియన్ క్రికెటర్లు వాడే బ్యాట్లు చాలా మందంగా ఉంటాయని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ వెధవలు చేస్తున్న ఆరోపణలలో నిజాలు లేవని చెబుతున్నారు. ఇలాంటి వెధవలను మీడియా ముందుకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇండియన్ క్రికెటర్లు వాడే బ్యాట్లలో రబ్బర్లు ఉండడం వాస్తవం కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి బ్యాట్ ను చెక్ చేసిన తర్వాతనే అంపైర్లు పర్మిషన్ ఇస్తారు. బ్యాట్ ( Bat) మందంలో ఏదైనా తేడాలు ఉంటే వెంటనే, అబ్జెక్షన్ చెప్పేస్తారు అంపైర్లు. సైజులో తేడాలు ఉన్న వెంటనే వేరే బ్యాట్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. పాకిస్తాన్ వాళ్లు నిత్యం ఇలాగే ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ అందులో నిజం లేదని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
"INDIAN BATSMEN USES RUBBER INSIDE THE BATS"🤯
Tanvir Ahmed said 🗣️,
"In the IPL, there’s a lot of talk about bats these days—some are bringing thick bats, others are bringing thin bats. That’s why, and I’m not just saying this, big names around the world say the same: 'We… pic.twitter.com/VN2hK5KLfH
— Cricket Central (@CricketCentrl) April 13, 2026