Tanveer Ahmed: టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. మొన్న ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది టీమిండియా. అయితే పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాను చాలా మంది మెచ్చుకుంటుంటే.. పాకిస్తాన్ మాజీలు మాత్రం తొండాట ఆడి గెలిచారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ అల్లా దిగి వచ్చినా కూడా.. టీమిండియా జట్టును పాకిస్తాన్ ఓడించేలా కనిపించడం లేదంటూ బాంబు పేల్చారు. మొన్నటి వరకు ఇండియాను కించపరుస్తూ మాట్లాడిన తన్వీర్ అహ్మద్, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. అసలు మర్మం తెలుసుకున్న తన్వీర్.. ఇండియాను మెచ్చుకున్నారు. పాకిస్తాన్ ఎంత మంది యోధులను దించినా, టీమిండియా మహిళలు లేదా పురుషుల జట్టును ఓడించడం కష్టమేనని తేల్చి చెప్పారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా విజయం పై తాజాగా తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అల్లా దిగి వచ్చినప్పటికీ.. బలమైన టీమిండియా జట్టును ఓడించడం పాకిస్తాన్ వల్ల కాదని బాంబు పేల్చారు. అన్ని విభాగాల్లో టీమిండియా మహిళల జట్టు చాలా అద్భుతంగా ఉందన్నారు. మిడిల్ ఆర్డర్ లో భారత క్రికెటర్లు కాస్త స్లోగా ఆడినప్పటికీ… ఫినిషర్లు మాత్రం అద్భుతంగా ఉన్నారని ప్రశంసించారు. దానికి తగ్గట్టుగానే టీమిండియాలో స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీమిండియా ఇంత బలంగా ఉన్న నేపథ్యంలో.. మహిళల పాకిస్తాన్ జట్టు గెలవడం కష్టమేనని తేల్చి చెప్పారు. ఇటు పురుషుల పాకిస్తాన్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో ఎక్కడ మ్యాచ్ జరిగిన.. పాకిస్తాన్ ఓటమిపాలవుతోందని… ఎన్ని జన్మలెత్తిన వాళ్లను ఓడించడం కష్టమేనని తెలిపారు.