Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా పై ఏదో ఒక కామెంట్ చేసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పంబం గడుపుకుంటున్నారు. ఇప్పటికే షాహిద్ ఆఫ్రీది, ఇంజమాం ఉల్ హక్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఇండియా పై విషం కక్కారు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా, పాకిస్తాన్ ( Team India, Pakistan) తలపడబోతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా టీమిండియాను చిత్తుగా పాకిస్తాన్ ఓడిస్తుందని స్పష్టం చేశారు. ఇది రంజాన్ మాసం అయిన నేపథ్యంలో… అల్లా అండతో ఇండియాను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇక అటు బుమ్రా కెరీర్ బుంగిపాలు చేస్తామని తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చేసింది. ఇప్పటి వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు అన్నీ ఫినిష్ అయ్యాయి. రేపటి నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా సూపర్ 8 లోకి వచ్చేసాయి. కానీ రెండు డిఫరెంట్ గ్రూపుల్లో ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్నీ కలిసి వస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరోసారి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు తలపడబోతున్నాయని జోష్యం చెప్పారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియాను కచ్చితంగా పాకిస్తాన్ ఓడిస్తుందని.. వాళ్లపై ప్రతి కారం తీర్చుకుంటుందని కూడా హెచ్చరించారు. ఇది రంజాన్ మాసం అయిన నేపథ్యంలో అల్లా మొత్తం పాకిస్తాన్ కు అండగా నిలుస్తాడని వెల్లడించారు. అల్లా అండతో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, బుమ్రా కెరీర్ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్ లు 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను కొలంబో వేదికగా ఓడించింది టీమిండియా.