Gautam Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs New Zealand, Final) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా టైటిల్ గెల్చుకుంది. ఇక ఈ టైటిల్ గెలిచిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, టైటిల్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పక్కనే ఉన్న హనుమంతుని టెంపుల్ లో ట్రోఫీని పెట్టి పూజలు చేశారు. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాటర్ బాటిల్ రూ.100
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన తర్వాత గుడికి ట్రోఫీని తీసుకు వెళ్లడంపై 1983 వరల్డ్ కప్ విజేత, టీఎంసీ పార్టీ కీర్తి ఆజాద్ ( Kirti Azad) సీరియస్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీతో హిందూ ఆలయానికి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కీర్తి ఆజాద్. టీమిండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని వెల్లడించారు. కేవలం ఒక మతాన్నిదో లేదా ఐసీసీ జై షా కుటుంబాన్నిదో కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మహమ్మద్ సిరాజ్ మసీదుకు లేదా సంజు శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకువెళ్తే బాగుండేదని చురకలు అంటించారు. ఒక మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని విమర్శలు చేశారు.
టి20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని హనుమంతుని గుడికి తీసుకు వెళ్లడంపై కీర్తి ఆజాద్ విమర్శలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) తాజాగా రివర్స్ అటాక్ చేశారు. హనుమంతుని గుడికి కాకపోతే మసీదుకు తీసుకువెళ్లాలా ? అంటూ సీరియస్ అయ్యారు గంభీర్. కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనవి అని మండిపడ్డారు. టీమిండియా తరఫున మైదానంలోకి దిగామంటే… తమ మధ్య ఎలాంటి మత విద్వేషాలు ఉండబోవు అని క్లారిటీ ఇచ్చారు. 140 కోట్ల భారతీయుల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు మాత్రమే క్రికెట్ ఆడుతామని తెలిపారు. క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి మతాలు వారివి.. కానీ ఇండియా తరఫున ఆడేటప్పుడు అందరం కలిసికట్టుగా.. మత విద్వేషాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడతామని గంభీర్ క్లాస్ పీకారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు.. హనుమంతుడి గుడికి వెళ్లడంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ టోర్నమెంటుకు రాజకీయ రంగు పూస్తున్నారని సీరియస్ అయ్యారు.
Trinamool Congress MP and former cricketer Kirti Azad has raised questions over India's T20 captain Suryakumar Yadav, coach Gautam Gambhir, and ICC chairman Jay Shah taking the World Cup trophy won on Sunday to a Hindu temple in Ahmedabad#JayShah #GautamGambhir #SuryakumarYadav… pic.twitter.com/p9Yud2QFyW
— Hindustan Times (@htTweets) March 9, 2026