Trolls On Mohsin Naqvi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. మరో 20 శాతం మ్యాచులు ఫినిష్ అయితే, టోర్నమెంట్ పూర్తికానుంది. మే 31వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Ahmedabad Narendra Modi Stadium) జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి (Mohsin Naqvi) ఆహ్వానం అందింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కు హాజరు కావాలని ఐసీసీ ఇప్పటికే ఆహ్వానం పంపింది.
దీంతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి నఖ్వీ వస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో మొహ్సిన్ నఖ్వీ పరువు తీసేలా ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ దొంగ నా కొడుకును అహ్మదాబాద్ స్టేడియానికి రానివ్వకండి అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు. మోడీ స్టేడియానికి వస్తే ఆసియా కప్ తరహా లోనే, ఐపీఎల్ టైటిల్ కూడా మొహ్సిన్ నఖ్వీ దొంగిలిస్తాడని పోస్టులు పెడుతున్నారు. టైటిల్ దొంగతనం చేస్తున్నట్లు మొహ్సిన్ నఖ్వీ ఫోటోలను క్రియేట్ చేసి ఆడుకుంటున్నారు. దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పైన ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా… వాస్తవంగా టైటిల్ అందుకోవాల్సింది. కానీ ACC చైర్మన్ గా నఖ్వీ ఉన్న నేపథ్యంలో అతని చేతుల మీదుగా టైటిల్ అందుకోబోమని సూర్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత టైటిల్ తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్లు వెళ్లలేదు. దీంతో ఆ టైటిల్ ను తన ఆఫీసులోనే పెట్టేసుకున్నాడు నఖ్వీ. పద్ధతి ప్రకారం ఇండియాకు నఖ్వీ పంపించాల్సి ఉంది. అలా చేయకుండా టైటిల్ నే లేపేశాడు. దీంతో ఆసియా కప్ 2025 ట్రోఫీని దొంగిలించాడని నఖ్వీని అప్పట్లో ఆడుకున్న సంగతి తెలిసిందే.
మే 30, 31 తేదీలలో ఐసీసీ పాలకమండలికి సంబంధించిన సమావేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డుల చైర్మన్ లకు పిలుపు వెళ్ళింది. అహ్మదాబాద్ కు రావాలని నఖ్వీతో పాటు మిగిలిన చైర్మన్ లందరూ రావాలని ఐసీసీ నుంచి పిలుపు వెళ్ళింది. అలాగే వచ్చిన చైర్మన్ లందరూ ఐపీఎల్ ఫైనల్ చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. కానీ నఖ్వీ రావడం పై ఇంకా సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్ సర్కార్ నుంచి అనుమతులు వస్తేనే ఇండియాలో పర్యటిస్తారు నఖ్వీ.
🚨 MOHSIN NAQVI COMING TO INDIA? 🤯
– PCB Chairman Mohsin Naqvi has been invited by ICC to attend the meetings held on 30 and 31 May in Ahmedabad during the IPL final.
– The decision of Mohsin Naqvi going to India will be made by Prime Minister Shahbaz Shareef. (Geo news) pic.twitter.com/tlYxPTBK5K
— Abdullah. (@Abdullahh_56) May 16, 2026