E-Paper
Advertisement

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే
Advertisement

Virat Kohli: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) జపం చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ గడ్డపై వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్లకార్డులు పట్టుకొని రచ్చ రచ్చ చేశారు. విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మొన్న బెంగళూరు (RCB) ఛాంపియన్ అయిన సందర్భంగా కూడా పాకిస్థాన్ లో సంబరాలు చేసుకున్నారు కోహ్లీ అభిమానులు. ఇక నిన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగగా… విరాట్ కోహ్లీ ప్లకార్డులు పట్టుకొని, స్టేడియంలో రచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవి చూసినా కోహ్లీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మా కింగ్ కోహ్లీకి… శత్రువు అయినా కూడా ఫ్యాన్ కావాల్సిందేనని అంటున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు వన్డేలు ఫినిష్ అయ్యాయి. మొదటి వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించగా, రెండో వన్డేలో 41 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. నిన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా రెండవ వన్డే జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 231 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయిన పాకిస్తాన్… 190 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో రెండో వన్డేలో పాకిస్తాన్ పైన ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్లకార్డులు కనిపించాయి. పాకిస్తాన్ కింగ్ అంటూ విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూ ఈ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన బ్యాటింగ్ పై కూడా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. టెస్టుల్లో ఆడినట్లు విరాట్ కోహ్లీ ఆడాడని… అతనికంటే వైభవ సూర్యవంశీ బెటర్ అని చురకలు అంటించారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ జరిగిందని.. అందుకే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడినట్లు ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×