E-Paper
Advertisement

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు !

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు !
Advertisement

Fire in Gujarat Titans Team Bus: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మన ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో, అద్భుతంగా రానించి బెంగుళూరు చాంపియన్ అయింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత హోటల్ రూమ్ కు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు బయలుదేరారు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ స్టేడియం బయట, గుజరాత్ టైటాన్స్ ప్రయాణించే బస్సుకు పెను ప్రమాదం జరిగింది. ఒకసారి గా బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్ర‌మాదం వెనుక ఆర్సీబీ ( RCB fans ) అభిమానుల కుట్ర‌లు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకు పెను ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణించే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గంటసేపు నడిరోడ్డు పైన ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. ఆ తర్వాత వేరే బస్సులో వెళ్ళిపోయారు. గుజరాత్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ బస్ బుక్ చేసింది. దీంతో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత, హోటల్ రూమ్ కు వెళ్లారు ప్లేయర్లు. అయితే గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు ప్రయాణించాల్సిన బస్సులో అగ్ని ప్రమాదం ( Fire in Gujarat Titans Team Bus) జరగడానికి కారణం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ తమ ప్రత్యర్థి అన్న ఒక్క కారణంతో.. విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు రెచ్చిపోయారట.

ఇందులో భాగంగానే బస్సులో ఉన్న వైర్లను మొత్తం కట్ చేసినట్లు ఓ కథనం వైరల్ గా మారింది. అయితే వాళ్లు చేసిన ఈ చెత్త పని కారణం వల్ల… బస్సులో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అయితే బస్సులో మంటలు చెలరేగిన నేపథ్యంలో డ్రైవర్ అందరిని అప్రమత్తం చేశాడు. అదే రన్నింగ్ లో ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్లేయర్లు చనిపోయేవారు. ఇలాంటి క్రమంలో బెంగుళూరు అభిమానుల కుట్ర ఉందని సోషల్ మీడియాలో వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. దీనిపై గుజరాత్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఫ్యాన్స్ అంటే మ్యాచ్ వరకు మాత్రమే ఉండాలని.. ఆ తర్వాత అందరు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇలా ఇతరుల ప్రాణాలు అస్సలు తీయకూడదని ఫైర్ అవుతున్నారు. బెంగళూరు అభిమానులకు కొంచెం కూడా సిగ్గు లేదని సీరియస్ అవుతున్నారు.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×