E-Paper
Advertisement

IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే

IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
Advertisement

IND VS AUS: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వర్సెస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య వివాదాలు రోజురోజుకు ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ప్రవర్తన కారణంగా టీమిండియాలో చీలిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణమైంది టీమిండియా. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు అందరూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభేరుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మాత్రం నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి టీం ఇండియాలో కలిసిపోయారు. అనంతరం ప్లేయర్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Also Read: Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

గంభీర్ కు షాకిచ్చిన కోహ్లీ, రోహిత్‌

Advertisement

ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు గౌతమ్ గంభీర్ కు మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిపోర్ట్ చేయలేదట. తమపై గౌతమ్ గంభీర్ పగ పెంచుకున్నాడు అన్న కోపంతో రగిలిపోతున్నారట రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ. అంతేకాదు నిన్న గౌతమ్ గంభీర్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గౌతమ్ గంభీర్ కు టీమిండియా క్రికెటర్లు అలాగే మాజీ ప్లేయర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ మహేంద్ర సింగ్ ధోనితో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం గౌతమ్ గంభీర్ కు శుభాకాంక్షలు తెలపలేదని తెలుస్తోంది. ఇక ఇవాళ రిపోర్ట్ చేయకుండానే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. దీంతో టీం ఇండియాలో చీలిక ఏర్పడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా సిరీస్ షెడ్యూల్

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు సిరీస్ జరగనుంది. ఇందులో వన్డేలు అలాగే t20 మ్యాచ్ లు జరుగుతాయి. టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23వ తేదీన రెండవ వన్డే అలాగే అక్టోబర్ 25వ తేదీన మూడో వన్డే జరుగుతుంది. అక్టోబర్ 29వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20లు జరుగుతాయి. సూర్య కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో టీ20లు ఆడ‌నుంది టీమిండియా ( Team India) జ‌ట్టు.

Advertisement

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×