E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: కోహ్లీ దేశ ద్రోహి అంటూ ట్రోల్స్‌..ఇంగ్లాండ్ జెర్సీ వేసుకుని మ‌రీ !

Ind vs Eng 2nd Semi-Final: కోహ్లీ దేశ ద్రోహి అంటూ ట్రోల్స్‌..ఇంగ్లాండ్ జెర్సీ వేసుకుని మ‌రీ !
Advertisement

Ind vs Eng 2nd Semi-Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ గురువారం రోజున ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా అద్భుతంగా రానించి ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయం నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ నుంచి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ జరిగిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జెర్సీ ధరించి… ముంబైలోని వాంఖడే స్టేడియానికి వచ్చాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ మరికొంతమంది దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ విమర్శలు ?

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగగా అందరూ ఇండియా గెలవాలని కోరితే.. విరాట్ కోహ్లీ మాత్రం ఇంగ్లాండుకు సపోర్ట్ గా నిలిచాడని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ జెర్సీ వేసుకొని.. దొంగ చాటున ముంబైలోని వాంఖడే స్టేడియానికి విరాట్ కోహ్లీ వచ్చాడని పోస్టులు కూడా వైరల్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ ఇద్దరూ దేశభక్తిని చాటుతూ దర్జాగా విఐపి గ్యాలరీలో ఇండియాను సపోర్ట్ చేస్తూ మ్యాచ్ చూసారని గుర్తు చేస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం దొంగచాటున ఇంగ్లాండ్ కు సపోర్ట్ చేస్తూ.. మన ఇండియాకు వెన్నుపోటు పొడుస్తున్నాడని దారుణంగా ఆడుకుంటున్నారు.

విరాట్ కోహ్లీ పై విమర్శలకు కారణం ఇదే

Advertisement

మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లను మెచ్చుకుంటూ, విరాట్ కోహ్లీని ట్రోలింగ్ చేయడం వెనక ప్రత్యేక కారణం ఉంది. ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడి డబ్బులతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, తన కుటుంబాన్ని మొత్తం లండన్ లో పెట్టాడు. అక్కడే స్పెషల్ గా విల్లా కూడా కొనుగోలు చేశాడు. త్వరలోనే లండన్ పౌరసత్వానికి కూడా తీసుకోబోతున్నాడట విరాట్ కోహ్లీ. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడి డబ్బు తిని, లండన్ లో విరాట్ కోహ్లీ సెటిల్ కావడం ఇండియన్స్ కు అస్సలు నచ్చడం లేదు. మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ లాగా ఇండియాలోనే ఉండ‌చ్చు క‌దా..? అంటున్నారు. ఇక్క‌డ డ‌బ్బు సంపాదించి, ఇంగ్లాండ్ వాడికి టాక్సులు క‌ట్టడంపై జ‌నాలు సీరియ‌స్ అవుతున్నారు. అందుకే కోహ్లీని దేశ ద్రోహి అంటున్నారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

?igsh=cTRkZHVuNTY3NDg2

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×