BigTV English

Virender Sehwag : మేమూ, మాకొక వంటవాడు.. ఇంగ్లాండ్ తీరుపై సెహ్వాగ్ సెటైర్లు..

Virender Sehwag : జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్- టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్ భారత్ లో ఏడు వారాలు గడపనుంది. దీంతో తమ ఆటగాళ్లు అనారోగ్యం పాలవకుండా తమతో పాటు ఒక వంటవాడు (చెఫ్) ని తీసుకువస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Virender Sehwag : మేమూ, మాకొక వంటవాడు.. ఇంగ్లాండ్ తీరుపై సెహ్వాగ్ సెటైర్లు..

Virender Sehwag : జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్- టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్ భారత్ లో ఏడు వారాలు గడపనుంది. దీంతో తమ ఆటగాళ్లు అనారోగ్యం పాలవకుండా తమతో పాటు ఒక వంటవాడు (చెఫ్) ని తీసుకువస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ తన దైన రీతిలో సెటైర్లు పేల్చాడు. తనేమంటాడంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ లో కుక్ ఉండేవాడు. అతను రిటైర్ అయిపోయాడు. అందుకనే ఇప్పుడు ఈ కుక్ ని తీసుకొస్తున్నారా? అని అన్నాడు.


అంటే తన ఉద్దేశం ఒకప్పుడు ఇంగ్లాండ్ జట్టులో అలస్టర్ కుక్ అని ప్రముఖ ఆటగాడు ఉండేవాడు. తను విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు, బెస్ట్ ఓపెనర్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అప్పుడు మీకు ఒక కుక్ ఉండేవాడు, ఇప్పుడు లేడు కాబట్టి, ఈ కుక్ ని (వంటవాడిని) తీసుకొస్తున్నారా? అనే అర్థంలో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఈ ఒక్కమాట అనేసి ఊరుకోలేదు. ఇప్పుడంటే కుక్ ని తీసుకొస్తున్నారు. మరి ఐపీఎల్ లో పలువురు ఇంగ్లీషు క్రికెటర్లు ఆడుతున్నారు. వారు కూడా కుక్ ని తెచ్చుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. తర్వాత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కూడా మాట్లాడాడు. ఇండియా వచ్చే ఐపీఎల్ క్రికెటర్లు ప్రతీ ఒక్కరూ తమ వెంట సొంత చెఫ్ లను తీసుకురావడం సంప్రదాయంగా మారిపోతుందేమోనని సెహ్వాగ్ లాగే సెటైర్ వేశాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పటి కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. కాలం మారింది. వన్డే వరల్డ్ కప్ 2023 లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ నిర్వహించిన భారతదేశంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కావల్సిన వంటకాలు చేయలేదా? అనేది మనవాళ్ల ఉద్దేశం. వరల్డ్ కప్ లో సుమారు 10 దేశాలు ఆడాయి. అన్ని దేశాల ఆటగాళ్ల ఆహారపు అలవాట్లు, ఆ దేశంలో వండే ప్రత్యేక వంటకాలను మరీ మనవాళ్లు చేసి పెట్టారు.

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రతీ దేశపు ఆటగాళ్లు కూడా భారతదేశం ఆతిథ్యం చాలా బాగుందని మెచ్చుకుంటూ వెళ్లారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ అయితే అభిమానుల ఆదరణ, ఆతిథ్యం మరిచిపోలేనివని మరీ మరీ చెప్పాడు.
ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా అదే మాట చెప్పాడు.

ఇప్పుడు ఐపీఎల్ లో హైదరాబాద్ కెప్టెన్ అయిన తర్వాత కూడా నాకు హైదరాబాద్ అన్నా, అక్కడ బిర్యానీ అన్నా చాలా ఇష్టమని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వంటవాడిని తెచ్చుకుంటాం అనేసరికి, ఇది ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×