Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)
నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. 2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, గాడిలో పడ్డట్లు ఎక్కడ కనిపించడం లేదు. వరుసగా అన్ని మ్యాచ్ ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఇక లేటెస్ట్ గా ఈ సీజన్ లో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది చెన్నై. అయితే ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయిందని, స్కూల్ టీం కంటే దారుణంగా ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చేతిలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు వీరేంద్ర సెహ్వాగ్.
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, చెన్నై పరువు తీస్తూ మాట్లాడారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకప్పటి లాగా లేదని.. దాని పని అయిపోయిందని గాలి తీశారు. ధోని కాదు వాళ్ళ అయ్య దిగివచ్చిన కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం కష్టమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. పాకిస్తాన్ జట్టు కంటే అత్యంత దరిద్రంగా తయారైందని చెన్నై సూపర్ కింగ్స్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు.
ప్రస్తుతమున్న యంగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కాస్త టచ్ లోకి వస్తే ఆ జట్టు బతికి బయటపడుతుంది. లేకపోతే ఫస్ట్ రౌండ్ లోనే ఇంటిదారి పడుతుందని హెచ్చరించారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలకు చెన్నై అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. నీకేం తెలుసు చెన్నై సూపర్ కింగ్స్ బలం.. ముందు నీ తలకు ఉన్న బొచ్చు గురించి ఆలోచించుకో అంటూ ఫైర్ అవుతున్నారు.. అనవసరంగా మా జోలికి రాకు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)
నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) వరుసగా మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్,బెంగళూరు చేతిలో ఓడిపోయింది చెన్నై.