E-Paper
Advertisement

Rohit Sharma: మీ అందరితో ఆ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma: మీ అందరితో ఆ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma Invitation To Fans: 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా గురువారం ఉదయం స్వదేశంలో అడుగుపెట్టనుంది. టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యి.. ప్రపంచ కప్ జర్నీ విషయాలు షేర్ చేసుకోనున్నారు. ఆ తరువాత నేరుగా ముంబయి బయలుదేరతారు. సాయంత్రం ఐదు గంటలకు వాంఖడే స్టేడియం వద్ద విజయోత్సవ ర్యాలీ తీయనున్నారు.

అయితే ఈ విజయోత్సవ ర్యాలీకి అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చాడు. మీ అందరితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ కప్ స్వదేశానికి వస్తుందని అందరూ జాయిన్ కావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం భారత ఆటగాళ్ల తమ ఇళ్లకు చేరుకోనున్నారు.

ఇదే విషయమై బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. టీమిండియా ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ పరేడ్‌లో పాల్గొనండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. జులై 4న సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ ఉంటుందని.. అందులో పాల్గొనండి అంటూ ఆహ్వానించారు.

గత శనివారమే ప్రపంచ కప్ ఫైనల్ ముగిసినప్పటికీ కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా టీమిండియా ఆటగాళ్ల స్వదేశీ ప్రయాణం వాయిదా పడింది. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. దీంతో గురువారం ఉదయం వారు ఇండియాకు చేరుకోనున్నారు.

Tags

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×