yuzi chahal: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , అలాగే ధనశ్రీ వర్మ… ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీల.. విడాకుల గురించి సరికొత్త అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాహల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకులపై… రేపు తీర్పు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రేపు అంటే గురువారం రోజున మధ్యాహ్నం పూట…. చాహల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకులపై రేపు తీర్పు వెలువడుతుంది. చాహల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్ పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును కూడా బాంబే హైకోర్టు… ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూలింగ్ ఆఫ్ ఎవరిని మినహించాలన్న పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించినట్లు… బాంబే హైకోర్టు గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ లో… యుజ్వేంద్ర చాహల్ ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో… విడాకుల అంశంపై అతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని… బాంబే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో రేపు చాలా అలాగే ధనశ్రీ విడాకులపై తీర్పు ఇవ్వబోతుంది ఫ్యామిలీ కోర్టు. అయితే విడాకుల నేపథ్యంలో రూ. 4.75 కోట్లు భరణం ఇచ్చేందుకు చాలా అంగీకరించారట. మొదట 50 నుంచి 60 కోట్లు చాహల్ ను డిమాండ్ చేసిందట ధనశ్రీ వర్మ. కానీ కోర్టు ముందు మాత్రం 4.75 కోట్లు ఫైనల్ అయిందని సమాచారం. ఈ డబ్బును కూడా విడతల వారీగా… ధనశ్రీ వర్మ కు చెల్లించబోతున్నాడు చాహల్. ఈ మేరకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కాగా, చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ఇద్దరు కూడా 2020లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల పాటు.. ఈ ఇద్దరు చక్కగా కాపురం చేసుకున్నారు. కానీ… ధనశ్రీ వర్మ కారణంగా ఈ కాపురంలో చిచ్చు రాసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ అలాగే టీమిండియా యంగ్ క్రికెటర్ తో… ధనశ్రీ వర్మ పదేపదే చనువుగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో… యుజ్వేంద్ర చాహాల్ అలాగే ధనశ్రీ వర్మ మధ్య మనస్పర్ధలు…. చోటు చేసుకున్నాయట. దీంతో అప్పటినుంచి చాహల్ అలాగే ధనశ్రీ వర్మ వేరువేరుగా ఉంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ఇద్దరు కూడా తమ తమ సోషల్ మీడియాలో… ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశారు. అప్పుడు అందరికీ కన్ఫామ్ అయిపోయింది. ధనశ్రీ వర్మ అలాగే చాహల్ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక రేపు ఈ బంధం పై కోర్టు కూడా తీర్పు ఇవ్వబోతుంది. అయితే వీళ్ళిద్దరి అంశంలో చాలామంది.. టీమిండియా స్పిన్నర్.. చాహల్ వైపు మాత్రమే ఉంటున్నారు. ధనశ్రీ వర్మను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.