E-Paper
Advertisement

Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల పరిహారం

Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..  రూ.5 లక్షల పరిహారం

Medchal News:  మేడ్చల్, స్వేచ్ఛ, బ్యూరో: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి కె వెంకటేష్ ఆదేశించారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2021లో నిందితుడు మైనర్ బాలికను బెదిరింపులకు గురిచేసి ముంబైకు తీసుకెళ్లి లైంగిక దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read: Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్.. ఇదీ అసలు మ్యాటర్!

నిందితుడిపై బాధితురాలి తండ్రి హత్య

నిందితుడు షేక్ నజీర్ అలియాస్ అమిత్. ప్రస్తుతం దుండిగల్ మండలం చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం వికార్‌బాద్ జిల్లా యలాల్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడిపై బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించిన మరో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

Also Read: Attack on Amazon Data Centre: అమెజాన్ క్లారిటీ.. గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే, కాకపోతే

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×