Maoists Surrender: మావోయిస్టులు చేతులెత్తేశారా? ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతంకావడంతో మింగుడుపడడం లేదా? చాలామంది లొంగుబాటుకు మార్గం సుగమం చేసుకున్నారా? తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
కీలక నేతలు హతం కావడంతో మావోయిస్టులు చేతులెత్తేశారు. వీలు చిక్కినప్పుడల్లా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మిగతా నేతలు లొంగిపోతున్నారు. తాజాగా ‘బిగ్ టీవీ’కి అందుతున్న సమాచారం మేరకు.. 35 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు తెలుస్తోంది. వారిలో ముగ్గురు అగ్రనేతలు ఉన్నారని సమాచారం.
రాష్ట్ర చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటులో కొందరు అధికారులు చెబుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఎర్రోళ్ల రవి అలియాస్ ప్రశాంత్ కేఎండీసీ కమాండర్, ఆదిలాబాద్ నస్పూర్ దళం బెటాలియన్ కమాండర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారితోపాటు భారీగా ఏకే 47, ఇన్సాస్, ఎస్ ఎల్ ఆర్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారట పోలీసులు.
భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు
దీనికి సంబంధించి పూర్తి వివరాలను శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి వివరాలు తెలియజేయనున్నారు. లొంగిపోయినవారు ఏ ప్రాంతాలనికి చెందినవారు? తెలంగాణ లేదా ఏపీకి చెందిన కీలక నేతలున్నారా? అనేది కాసేపట్లో తెలియనుంది. వచ్చే ఏడాది మార్చి చివరినాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని పదే పదే చెబుతూ వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ మొదలుపెట్టారు. మావోలకు అడ్డాగా మారిన ప్రాంతాల్లో భారీగా బలగాలను మొహరించాయి.
బలగాలకు టెక్నాలజీ వినియోగించడంతో కీలక నేతలు హతమయ్యారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని పదే పదే చెబుతూ వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ మొదలుపెట్టారు. మావోలకు అడ్డాగా మారిన ప్రాంతాల్లో భారీగా బలగాలను మొహరించాయి.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్రావు అరెస్ట్?
బలగాలకు టెక్నాలజీ వినియోగించడంతో కీలక నేతలు హతమయ్యారు. ముఖ్యంగా ఆపరేషన్ ‘కగార్’తో బేజారెత్తిపోయాడు మావోయిస్టులు. మూల స్తంభాలుగా మారిన అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. నడిపించే నాయకుడు లేకపోవడంతో స్వచ్ఛందంగా తమ కేడర్లతో లొంగిపోతున్నారు.
మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్ఘడ్, ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లో భారీగా లొంగిపోయారు.. పోతున్నారు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే మావోయిస్టుల నెట్వర్క్ నిర్వీర్యం అయ్యింది. అందుకు కారణాలు లేకపోలేదు. అగ్రనేతలకు వయస్సు పైబడడం, చాలామంది అనారోగ్యాల బారినపడటం, సిద్ధాంతపరమైన విబేధాలు అన్నీ కలిసి ఉద్యమాన్ని నీర్చుగార్చిందని చెప్పవచ్చు.