BigTV English
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Road Accident in Hyderabad: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విద్యార్థులను ఎక్కించుకొని మెదక్ జిల్లాకు బయలుదేరిన బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.


వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో బీవీ రాజు కాలేజీకి చెందిన రెండు బస్సులు పరస్పరం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. విద్యార్థులను తీసుకొని కాలేజీకి వెళ్తుండగా.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ముందుగా వస్తున్న అదే కాలేజీకి చెందిన బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు సుమారు అరగంటపాటు శ్రమించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అలాగే, గాయపడిన విద్యార్థులతో పాటు ఇద్దరు డ్రైవర్లను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ నాగరాజుగా గుర్తించారు. ప్రస్తుతం మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


Also Read: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన తర్వాత నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. మృతదేహం బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో చాలా సమయం పట్టింది. దీంతో నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు కళాశాల సిబ్బంది ప్రయత్నించారు.

Related News

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

CP Sajjanar: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×