BigTV English
Advertisement

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 350 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామనికి చెందిన వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 150 లీటర్ల కల్తీ పాలు, రెండు లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .


గౌస్ కొండా గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న అస్ఘర్ అనే వ్యక్తి కూడా పాలను కల్తీ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్ఘర్ వద్ద నుండి 200 లీటర్ల కల్తీ పాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో కల్తీపాలను గుర్తించడంతో.. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. రోజూ తాము ఉపయోగించే పాలు కల్తీ అవుతున్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×