Sampath Kumar: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను నిరసిస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్ల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను ఆసరాగా చేసుకొని, బీఆర్ఎస్ నేతలు తనపై , ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జేసీబీ యజమానికి రావాల్సిన డబ్బుల విషయంలో జరిగిన చిన్న వివాదాన్ని బీఆర్ఎస్ పార్టీ తన సొంత పత్రిక వేదికగా వక్రీకరించిందని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్ వంటి నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడా లేదని.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు తెరలేపారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తన గౌరవానికి భంగం కలిగించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంపత్ కుమార్ హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సదరు నాయకులను , వారి సోషల్ మీడియా విభాగాన్ని కోర్టుకు ఈడుస్తానని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా చట్టపరంగా బుద్ధి చెప్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: పైలట్ల తప్పిదమా? సాంకేతిక లోపమా.. ప్రమాదానికి ముందు ఏమైంది?
బీఆర్ఎస్ నాయకులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రులపై కొందరు బీఆర్ఎస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఇద్దరు జేసీబీ డ్రైవర్ల మధ్య గొడవను ఆసరాగా చేసుకుని నాపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం… pic.twitter.com/hJvDwUTTze
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026