Tahsildar Corruption: స్వేచ్ఛ బ్యూరో: పైకం లేనిదే ఫైలు కదలదు.. కాసులు ముడితే చాలు ఎలాంటి చట్ట విరుద్ధ పనైనా జరిగిపోతుంది” అనే రీతిలో వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం తీరు మారిందని బాధితులు, న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏకంగా అత్యున్నత ధర్మాసనం అయిన హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేస్తూ, అధికార యంత్రాంగం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మంగళవారం కొడంగల్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. దౌల్తాబాద్ మండలం మొగులమడక గ్రామానికి చెందిన నర్సమ్మ (48) అనే మహిళా రైతుకు సంబంధించి సర్వే నంబర్ 74/1 లో సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గత పదేళ్లుగా న్యాయపోరాటం నడుస్తోంది.
తెలంగాణ హైకోర్టులో దాఖలైన WP No: 26990/2014 కేసులో భాగంగా, గౌరవ న్యాయస్థానం జనవరి 8, 2025న స్పష్టమైన తీర్పునిచ్చింది. పూర్వపు ఆర్డర్లను రద్దు చేస్తూ, అసలైన పట్టాదారు వారసుల పేర్లను చేర్చాలని, నిబంధనల ప్రకారం మళ్లీ విచారణ జరిపి రైతుకు న్యాయం చేయాలని తహసీల్దార్ను ఆదేశించింది.
Also read: థలపతి విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
కోర్టు ఆదేశాల మేరకు 2025లో విచారణ ప్రక్రియ జరిగి, అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలయ్యాయి. కేసు తుది ఉత్తర్వుల (Final Order) కోసం వేచి ఉన్న తరుణంలో, స్థానిక తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని న్యాయవాది కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Chris Gayle: చిన్నపిల్లాడిని చేసిన నరకం చూపించారు…పంజాబ్ ఓనర్లు దుర్మార్గులు