E-Paper
Advertisement

Bhadradri: అటవీ అధికారిపై గుత్తికోయల దాడి.. కత్తి వేటుకు మృతి..

Bhadradri: అటవీ అధికారిపై గుత్తికోయల దాడి.. కత్తి వేటుకు మృతి..
Advertisement

Bhadradri: పోడు భూముల వివాదం ఫారెస్ట్ రేంజర్ హత్యకు దారి తీసింది. ఎన్నాళ్లుగానే సాగుతున్న వ్యవహారంలో పరిష్కారం రాకపోవడంతో గుత్తికోయలు రెచ్చిపోయారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులపై తిరగబడ్డారు. కత్తులతో దాడి చేయడంతో రేంజర్ శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడులో.. అటవీశాఖ నాటిన మొక్కలు తొలగించేందుకు పోడు భూముల సాగుదారులు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై గిరిజనులు మూకుమ్మడిగా దాడి చేశారు. భయపడిన సెక్షన్‌ అధికారి రామారావు అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై అడవి బిడ్డలు ఆటవికంగా కత్తి, వేట కొడవలితో దాడి చేశారు.

Advertisement

గిరిజనుల దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో కత్తి వేటు పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే శ్రీనివాసరావును చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×