BigTV English
Advertisement

Hyderabad Metro: హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. మెట్రో ఛార్జీలు పెంపు..?

Hyderabad Metro: హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. మెట్రో ఛార్జీలు పెంపు..?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది బ్యాడ్ న్యూస్. ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైల్ హైదరాబాద్ మూడు కారిడార్లలో ఛార్జీలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారులు దీనికి సంబంధించి నిర్ధిష్ట వివరాలను వెల్లడించనప్పటికీ.. 2017 సంవత్సరంలో మెట్రో ప్రారంభించినప్పటి నుంచి పెరుగుతోన్న ఆర్థిక నష్టాల కారణంగా ఛార్జీ పెంపు ఉండొచ్చని సమాచారం.


హైదరాబాద్ మహానగరంలో మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్థలో తీవ్ర నష్టాల్లో ఉందని.. అందుకే నష్టాన్ని తగ్గించేందుకు ఛార్జీలు పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం మేరకు మెట్రో  నష్టాలు రూ.6,500  కోట్ల దాటాయని.. అందుకే ఛార్జీల పెంచెందుకు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్ట్ ను నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్ మిగిలిపోకుండా ఉంచేందుకు ఛార్జీ ల పెంపు తప్పదని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. కనిష్టంగా 2 కి.మీ లకు రూ.10, గరిష్టంగా 26 కి.మీ లకు రూ.60 ఛార్జీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పెంచనున్న ఛార్జీలతో దాదాపు 5 లక్షల పైన ప్రయాణికులకు భారం పడనుంది. అయితే సంస్థ ఛార్జీలపై ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషస్తున్నప్పటకీ.. ఏ మార్గాన కూడా ఆశించినంత ఆదాయం రావడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్ ను తగ్గించేందుకు ఛార్జీల పెంపు తప్పనిసరి అధికారులు చెబుతున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ మెరుగు పరిచేందుకు కఠిన నిర్ణయాలు తప్పడం లేదని సంస్థ ప్రకటించింది.


కర్నాటక రాజధాని బెంగళూరు లో ఇటీవల మెట్రో టిక్కెట్ ఛార్జీలు పెంచారు. అక్కడ 44 శాతం ఛార్జీలను పెంచారు. 25 కి.మీ దాటితే గరిష్టంగా రూ.90 వరకు ఛార్జీలు పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో ఛార్జీలను 2017లో పెంచారు. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ లో కూడా మెట్రో టికెట్ ఛార్జీలు భారీగానే పెంచనున్నట్లు తెలుస్తోంది. కనీసం 30 నుంచి 40 శాతం వరకు టిక్కెట్ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల కలిగే నష్టాల కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలో ఎల్అండ్ టీ ప్రెసిడెంట్, డైరెక్టర్, సీఎఫ్ఓ శంకర్ రామన్ అన్నారు. ఈ పథకం కొనసాగితే 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో నుండి వైదొలుగుతామని తెలిపారు. దీంతో మెట్రో నష్టాల కారణంగా తాము మహాలక్ష్మి పథకాన్ని ఆపలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అవసరమైతే ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నుంచి వారికి నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రిటైల్ స్థలాలు అలాగే ప్రకటనల వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, మెట్రో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం ఛార్జీలను పెంచడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. మెట్రో టికెట్ ఛార్జీల పెంపుపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపే అఫీషియల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?

 

Related News

CM Progress Report: తమాషాలు చేస్తే తాట తీస్తా.. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

KTR: బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక..

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Big Stories

×