E-Paper
Advertisement

చట్టం ముందు ఎవరైనా సమానమే.. కొడుకు లొంగుబాటుపై బండి సంజయ్ వ్యాఖ్యలు

చట్టం ముందు ఎవరైనా సమానమే.. కొడుకు లొంగుబాటుపై బండి సంజయ్ వ్యాఖ్యలు
Advertisement

Bandi Bhageerath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో శనివారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేయగా.. శనివారం ఆయన తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో కలిసి స్వయంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. అనంతరం పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, ఈ విషయంలో తానేమీ వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని, ఫిర్యాదు అందిన వెంటనే స్టేషన్‌లో అప్పగించాలని అనుకున్నట్లు వివరించారు.

Advertisement

అయితే, పోలీసులకు అప్పగించడంలో కొంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. తాము ముందుగా న్యాయవాదులను సంప్రదించి, తమ వద్ద ఉన్న ఆధారాలను వారికి చూపించామని అన్నారు. ఆ ఆధారాలను పరిశీలించిన లాయర్లు.. కేసు కొట్టేస్తారని, కచ్చితంగా బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారని చెప్పారు. అందుకే పోలీసుల ముందుకు రావడానికి కాస్త జాప్యం జరిగిందని బండి సంజయ్ మీడియాకు స్పష్టం చేశారు.

Also Read: ఈనెల 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు.. మంత్రుల కీలక సమీక్ష!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×