E-Paper
Advertisement

Bandi Sanjay : కేసీఆర్ కోసం శాలువా తెచ్చా.. సీఎం ఎక్కడున్నారు..? : బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ కోసం శాలువా తెచ్చా.. సీఎం ఎక్కడున్నారు..? : బండి సంజయ్
Advertisement

Bandi Sanjay : హైదరాబాద్ లో మోదీ పర్యటన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ స్పీచ్ ను గులాబీ నేతలు తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఇటు బీజేపీ నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.

కొంతకాలంగా తెలంగాణలో ప్రధాని మోదీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనడంలేదు. మంత్రులే ప్రధానికి స్వాగతం చెప్పేందుకు వెళుతున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సావానికి కేసీఆర్ వెళ్లలేదు. తాజాగా మోదీ పర్యటన షెడ్యూల్ ప్రకటించగానే కేసీఆర్ హాజరుకారని ముందే స్పష్టత వచ్చింది. సభ ప్రాంగంణంలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ కోసం కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. అయితే గులాబీ బాస్ మరోసారి మోదీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ తీరును బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.

Advertisement

ప్రధానమంత్రి మోదీ సభకు కేసీఆర్ ఎందుకు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నేటి సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తారని ఎదురుచూశానన్నారు. వస్తే సన్మానించేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని చెప్పారు.

తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రధాని మోదీ చేపట్టారని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కేసీఆర్‌ ఎందుకు రాలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని బండి ఎదురుదాడికి దిగారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×