Bhagirath Bail: పోక్సో కేసులో అరెస్టు అయిన కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమారుడు బండి బగీరథ్ బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును మరోసారీ ఆశ్రయించాడు. దీంతో జైలుకు వెళ్లి నలభై ఐదు రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్డు విచారణ చేయనుందని జస్టిస్ కలసికం సుజన తెలిపింది. తాను నిర్దోషి అని, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆరోపిస్తూ, తాను దర్యాప్తుకు సహకరించానని, పిటిషన్లో బండి భగీరథ్ పేర్కోన్నారు.
ఈనెల 20 న బిబిఎం బ్యాక్ లాగ్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన భగీరథ్ పరీక్షల అనంతరం ఈనెల 25 న తిరిగి జైలుకు వెళ్లాడు. గత నెల 16 న మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే..
Also read: మాట ఇచ్చి మర్చిపోయారా.. సిగాచి బాధితుల కన్నీళ్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్!
గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా బండి భగీరథ్ ఉన్నాడు. ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసులలో అరెస్ట్ అయిన బగీరథ్ గత 45 రోజుల తర్వాత బెయిల్ అభ్యర్థించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భగీరథ్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి మే నెల 16 నుండి జూన్ 30 వరకు అంటే మోత్తం 45 రోజులు దాటుతుంది కాబట్టి బెయిల్ పిటిషన్ వేసినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు.