Sitarama Project: ప్రారంభించిన ఏడాదికే సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ సీ.సీ లైనింగ్ ధ్వంసమైందని, ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ పరిస్థితిని వివరిస్తూ కథనం ప్రచురితమైంది తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో తాజా గా మరో చోట జూలూరుపాడు మండలం వినోభా నగర్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ రాజీవ్ లింక్ కెనాల్ స్టీనింగ్ వాల్ కుప్పకూలింది.
మూడు రోజుల వ్యవధిలో నాలుగు చోట్ల వేర్వేరు గా కుంగిన ఘటనతో కాలువ నిర్మాణ నాణ్యత పై పలు ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. తాజాగా మరో చోట మొన్న ఏన్కూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ సీ.సీ లైనింగ్ ధ్వంసమైన ఘటన మరువకముందే, తాజాగా జూలూరుపాడు మండలంలోనూ సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణ పనులు ధ్వంసమైన తీరు ఈ కెనాల్ ‘నాణ్యత’ను ప్రశ్నిస్తోంది.
Also Read: సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా
మెన్నటి ధ్వంసమైన సీ.సీ లైనింగ్ పనులకు కాంట్రాక్టురు చేత మరమ్మత్తులు జరిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విషయం మరువకముందే తాజాగా రాజీవ్ లింక్ కెనాల్ కు మరోచోట నిర్మాణ పనులు ధ్వంసమయ్యాయి. ‘సీతారామ’ ప్రాజెక్టులో లింక్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చించిన రూ. 72 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
Also Read: మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి