Nizamabad BRS: బీఆర్ఎస్ (BRS) పార్టీలో వెనుకబడిన తరగతుల (BC) నేతల ఆగ్రహం భగ్గుమంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్లో బీసీ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా హాజరయ్యారు. అయితే, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి జెండా మోసిన బీసీ నాయకులను గుర్తించడం లేదంటూ.. కొందరు బీసీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తమ ఆగ్రహాన్ని చూపించారు.
వేదికపై ఉన్న ముఖ్య నేతల్లో అత్యధికంగా ఓసీ (OC)లే కూర్చున్నారని, బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ బీసీ నేతలు మండిపడ్డారు. ఈ దీక్షా దివస్లో బీసీ నేతల నిరసన నిజామాబాద్ బీఆర్ఎస్లో అంతర్గత చిచ్చుకు దారితీసినట్లు కనిపిస్తోంది. పార్టీలో వర్గాల మధ్య సమన్వయ లోపం, ముఖ్యంగా బీసీ నేతలకు సరైన గుర్తింపు లేకపోవడంపై ఈ తాజా పరిణామాలు గట్టి సంకేతాలిచ్చాయి.
ALSO READ: Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?