E-Paper
Advertisement

Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు

Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు
Advertisement

Nizamabad BRS: బీఆర్‌ఎస్ (BRS) పార్టీలో వెనుకబడిన తరగతుల (BC) నేతల ఆగ్రహం భగ్గుమంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్‌లో బీసీ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా హాజరయ్యారు. అయితే, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి జెండా మోసిన బీసీ నాయకులను గుర్తించడం లేదంటూ.. కొందరు బీసీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తమ ఆగ్రహాన్ని చూపించారు.

Advertisement

వేదికపై ఉన్న ముఖ్య నేతల్లో అత్యధికంగా ఓసీ (OC)లే కూర్చున్నారని, బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్ బీసీ నేతలు మండిపడ్డారు. ఈ దీక్షా దివస్‌లో బీసీ నేతల నిరసన నిజామాబాద్ బీఆర్‌ఎస్‌లో అంతర్గత చిచ్చుకు దారితీసినట్లు కనిపిస్తోంది. పార్టీలో వర్గాల మధ్య సమన్వయ లోపం, ముఖ్యంగా బీసీ నేతలకు సరైన గుర్తింపు లేకపోవడంపై ఈ తాజా పరిణామాలు గట్టి సంకేతాలిచ్చాయి.

ALSO READ: Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×