Bhatti Vikramarka:స్వేచ్ఛ బ్యూరో: విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని అభివర్ణించారు.
నాణ్యతతో.. వేగంగా పూర్తి చేయాలి
నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలోని భవన సముదాయాలను విక్రమార్క కాలినడకన తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్ విభాగాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీపురం స్కూల్ ఆవరణ అంతా తిరుగుతూ పనుల ప్రగతిని తెలుసు కున్నారు. విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి.. కేవలం వ్యయం కాదు, అది రాబోయే భవిష్యత్ తరాలను శక్తివంతంగా నిర్మించడం కోసం పెట్టే అద్భుతమైన పెట్టుబడి అన్నారు.
Also Read: మోదీ సర్కార్పై పోరుకు ‘ఇండియా కూటమి’ సిద్ధం.. జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు!