E-Paper
Advertisement

BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తుపై తరుణ్ చుగ్ క్లారిటీ..

BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తుపై తరుణ్ చుగ్ క్లారిటీ..
Advertisement

BJP : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని భావిస్తోంది. మరోవైపు బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అలాగే మునుగోడు ఉపఎన్నికల సమయంలో బూర నర్సయ్య గౌడ లాంటి నేతలకు కాషాయ కండువా కప్పింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్‌ మీడియా కథనాలు రాసిందని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని అన్నారు.

Advertisement

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×