E-Paper
Advertisement

BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తుపై తరుణ్ చుగ్ క్లారిటీ..

BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తుపై తరుణ్ చుగ్ క్లారిటీ..
Advertisement

BJP : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని భావిస్తోంది. మరోవైపు బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అలాగే మునుగోడు ఉపఎన్నికల సమయంలో బూర నర్సయ్య గౌడ లాంటి నేతలకు కాషాయ కండువా కప్పింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్‌ మీడియా కథనాలు రాసిందని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని అన్నారు.

Advertisement

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Related News

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×