E-Paper
Advertisement

BJP Leader Murder: యూసఫ్‌గూడలో దారుణం.. బీజేపీ నేత హత్య!

BJP Leader Murder: యూసఫ్‌గూడలో దారుణం.. బీజేపీ నేత హత్య!
Advertisement

BJP Leader Ramulu Murder: హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాములు అనే వ్యక్తిపై 10 మంది గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి కత్తులతో అతి కిరాతకంగా దాడి చేశారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ రాములు గత కొంతకాలంగా సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో బీజేపీలతో చేరారు.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రామన్నను గత రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ కృష్ణచైతన్య, జూబ్లీహిల్స్ ఏసీపీ పరిశీలించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Read More : NIA Raids : హైదరాబాద్ లో NIA సోదాలు.. వీక్షణం ఎడిటర్ ఇంట్లో తనిఖీలు

ఆటోడ్రైవర్ స్థాయి నుంచి చేపల ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిన రామన్న.. అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి కొంతకాలంగా సోషల్ సర్వీస్ చేస్తూ పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం ప్రాంతం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రాములు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ హత్యకు పాతకక్షలు కారణమా లేక బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించినందుకే అంతమొందించారా అన్న కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×