E-Paper
Advertisement

Sangareddy : నవదంపతులపై దాడి.. యువతి అపహరణ

Sangareddy : నవదంపతులపై దాడి.. యువతి అపహరణ
Advertisement

Sangareddy : ప్రేమ పెళ్లి.. కొందరికి వరమైతే మరికొందరికి అదే శాపం. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి జీవితం దినదిన గండంగా మారుతోంది. నెలరోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా ఎత్తుకుపోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నస్తీపూర్ గ్రామానికి చెందిన నీరుడి అనిల్.. రామచంద్రాపూరం మండలం స్టేషన్ నాగులపల్లికి చెందిన అశ్విని దగ్గరి బంధువులవుతారు. వీరిద్దరూ నెలరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం తమకు ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అప్పటి నుంచి నస్తీపూర్ లోని అనిల్ ఇంటివద్ద నూతన దంపతులు ఉంటున్నారు.

Advertisement

నవంబర్ 5వ తేదీన కుటుంబ పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి జరిపించేందుకు యువకుడి కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు, బంధువులు సోమవారం తెల్లవారుజామున నస్తీపుర్ లోని అనిల్ ఇంటిపై, అనిల్ పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని తమతో తీసుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని తీవ్రగాయాలపైన అనిల్ ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×