E-Paper
Advertisement

Harish Rao: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు.. ఏమన్నారంటే..!

Harish Rao: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు.. ఏమన్నారంటే..!

Harish Rao: స్వేఛ్చ బ్యూరో: ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని బచ్చుగూడెం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొని ప్రజలను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్, మాజీ ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్‌చెరు మండల ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో హాజరై కాంగ్రేస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం రెండున్నర యేండ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమేనని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారెంటీల మాటలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయని, అభివృద్ధి మాట ఎక్కడ కనిపిస్తలేదని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రేస్ పాలనపై ఇప్పటికే విసుగు వచ్చిందని తెలిపారు. చిట్కుల్–బచ్చుగూడెం మార్గంలో బ్రిడ్జి నిర్మాణం, రోడ్డును విశాలంగా అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. రోడ్లు డెవలప్ అవ్వడం వల్ల చుట్టుపక్కల భూములకు ధరలు పెరిగాయని, దాంతో ప్రాంత అభివృద్ధి వేగంగా ముందుకెళ్లిందని చెప్పారు. ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. చిట్కుల్ నుంచి భరిలో ఉన్న కాంగ్రేస్ నాయకులను నిలదీసి ఆరు గ్యారెంటీల ముచ్చట ఏమైందో అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండున్నర యేండ్ల కాంగ్రేస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, మౌలిక వసతులు కూడా సరిగా అందించలేని చేతగాని ప్రభుత్వం ఇదని తీవ్రంగా విమర్శించారు.

Also Read: Mumbai Crime: దొంగగా మారిన బిజినెస్‌మేన్.. చివరకు పోలీసులకు చిక్కాడు? జల్సాల వల్లేనా?

ప్రజల సంక్షేమమే లక్ష్యం

మరుగున పడిన గ్రామాలను, కాలనీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టించాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, చిట్కుల్ మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్, పృథ్విరాజ్‌తో పాటు గ్రామ యువకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Also Read: Anil Ravipudi: హీరోగా సక్సెస్ డైరెక్టర్.. అనిల్ ఏమన్నారంటే?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×