E-Paper
Advertisement

KTR: 30న బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ఏం చెప్పారంటే?

KTR: 30న బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ఏం చెప్పారంటే?
Advertisement

KTR: Nజనవరి 30వ తేదీన గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ పలు కీలక కామెంట్స్ చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కీలకపాత్ర పోషించిందని, నాడు వారి పోరాట పటిమ అందరికీ స్పూర్తి అన్నారు. అలాగే సమాజానికి మంచి చేయడంలో విద్యార్థి విభాగం ఎప్పుడూ ముందుండాలని, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని, రాష్ట్రాన్ని అభివృద్ది పరిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడిచిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతా తిరోగతి వైపు పయనిస్తుందన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఉంటే, తమ హయాంలో 33 కాలేజీలు చేశామన్నారు.

Advertisement

Also Read: Manchu Lakshmi: వాళ్లు నన్ను వేధించారు.. దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మీ ఆగ్రహం

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మనం చేసిన అభివృద్దిని కాంగ్రెస్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటోందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమా అంటూ ప్రశ్నించిన కేటీఆర్, గతంలో మీసేవ ద్వార దరఖాస్తు చేసుకున్న అందరికీ నూతన రేషన్ కార్డులు అందించమన్నారు. జనవరి 30న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందజేస్తామని, ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×