E-Paper
Advertisement

Pilot Rohith Reddy: మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి.. ఈసారి రంగంలోకి రెవెన్యూ అధికారులు!

Pilot Rohith Reddy: మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి.. ఈసారి రంగంలోకి రెవెన్యూ అధికారులు!

Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్టు రెవిన్యూ అధికారులు గుర్తించారు. అంతంగారి జంగయ్య పేర ఉన్న ఈ భూమిలో పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేర ఫామ్ హౌస్ నిర్మించినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతికి ఎలా వచ్చింది? అన్న దిశగా విచారణ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ పరిధి సర్వే నెంబర్ 177/33లోని రెండు ఎకరాల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారంటూ ఇదే ఫార్మ్ హౌస్ లో సింహాయాజీ స్వామి, నందకుమార్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో తన ఫోన్ ను అక్రమంగా ట్యాప్ చేశారాంటూ నందకుమార్ ఫిర్యాదు కూడా చేశారు.

తాజాగా ఇదే ఫార్మ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తోపాటు మరికొందరితో కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు, ఫ్యూచర్ సిటీ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి చెందిన రివాల్వర్ తో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు సైతం జరిపాడు. ఈ సంఘటనలో పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. అదే సమయంలో ఫార్మ్ హౌస్ పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు లేఖ రాశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు ఫార్మ్ హౌస్ ఉన్న రెండు ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని గుర్తించారు. ఇది అంతంగారి జంగయ్య పేరు మీద ఉన్నట్టు నిర్ధారించారు. నిజానికి అసైన్డ్ భూమిని ఎవరికైనా కేటాయిస్తే వాళ్లు దాంట్లో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తప్పితే ఇతర కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేదు. ఆలా చేస్తే భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అయినా, పైలట్ రోహిత్ రెడ్డి తన తండ్రి విఠల్ రెడ్డి పేరు మీద విలాసవంతమైన ఫార్మ్ హౌస్ కట్టి అన్ని రకాల కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Also Read: IPL Recharge Plans 2026: ఐపీఎల్ స్పెషల్.. హాట్‌స్టార్ ఫ్రీగా లభించే.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

ఈ నేపథ్యంలో అంతంగారి జంగయ్యను పిలిపించి ఆయన పేర ఉన్న అసైన్డ్ భూమి పైలట్ రోహిత్ రెడ్డి చేతుల్లోకి ఎలా వెళ్లింది? అన్న వివరాలను తీసుకోనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంట్లో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఫార్మ్ హౌస్ ను సీజ్ చేస్తామని సైతం హెచ్చరించారు. అదే జరిగితే పైలట్ రోహిత్ రెడ్డికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×