Municipal Elections: స్వేచ్ఛ బ్యూరోొ: దాదాపు రెండు నెలల నిరీక్షణకు తెర పడింది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో మేజర్ స్థానాలు అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ బలోపేతం అయ్యినట్లు కనిపిస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఉన్నాయో కో ఆప్షన్ మెంబెర్స్ సహాయంతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. ఇదే పద్దతిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేసింది. చివరికి ఎన్నిక జరగకుండా వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది.
చైర్మన్ ఎన్నిక ప్రారంభం అయ్యినా పదినిమిషాల్లో కాంగ్రెస్ వాక్ఔట్ చేసింది. పార్టీల బాలబలాలు స్పష్టం కావడంతో 8 మంది కాంగ్రెస్, బీజేపీ ఒకరు, ఆకుల యాదగిరి చొప్పున కౌన్సిల్లర్లు, ఎమ్మెల్యే లు చైర్మన్ పోటీకి అవసరమైన బలం లేకపోవడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ పట్నం పీఠం దక్కించుకోవాలనే ఎన్నో ఆశలతో ప్రయత్నం చేసి బంగపడ్డారు. ఎన్ని రోజుల సమయం ఇచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులును ఆకర్శించ లేకుండా పోయారు. దేంతో పట్నం ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పలుచన అయ్యినట్లు ప్రచారం జరుగుతుంది.
Also read: నా గొంతు నొక్కేందుకే కుట్ర.. గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా, రాజ్యసభ పదవి తొలగింపుపై ఓ రేంజ్లో ఫైర్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీ రెండు స్థానాలు గెలిచింది. అయినప్పటికీ బీజేపీ కి వైస్ చైర్మన్ ఇవ్వడం బీఆర్ఎస్ గొప్ప మనస్సు అని చెప్పాలి. ఎందుకంటె బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఉంటే ఒకరు కాంగ్రెస్కు, మరొకరు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం గమనర్హం. అయినప్పటికీ బీఆర్ఎస్ ఒక్కరూ మద్దతు ఇచ్చిన వైస్ చైర్మన్ ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ సభ్యులు టేకుల సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా బిజెపికి చెందిన ముత్యాల శ్యామలను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వీరి చేత ఎన్నిక పరిశీలకులు హాజరై ప్రమాణస్వీకారం చేయించారు. మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్యలో నిర్వహించారు.
చైర్మన్ గా ఎన్నికైన టేకుల సుదర్శన్ రెడ్డి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. పట్నంలో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించి, టపాసులు కాల్చి విజయోత్సవాలు చేసుకున్నారు.
Also Read: రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!