BigTV English

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితోపాటు అతని అనుచరుడు అనిల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.


ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఆలయాలకు ధూపదీప నేపధ్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే ఆ ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.స్నేహం ముసుగులో తనను నిలువునా ముంచేశారని ఫిర్యాదుదారు దామోదర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.

హైదరాబాద్ శివారులోని సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూతేశారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో రైతు సంఘం నేతగా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×