E-Paper
Advertisement

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..

Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..
Advertisement

Jeevan Reddy : ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితోపాటు అతని అనుచరుడు అనిల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఆలయాలకు ధూపదీప నేపధ్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే ఆ ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.స్నేహం ముసుగులో తనను నిలువునా ముంచేశారని ఫిర్యాదుదారు దామోదర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.

Advertisement

హైదరాబాద్ శివారులోని సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూతేశారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో రైతు సంఘం నేతగా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×