Talasani Srinivas Yadav: బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది.
కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ (SR Nagar) పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సికింద్రాబాద్లో ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో తలసాని.. ముఖ్యమంత్రి పదవిని, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిపై ఇటువంటి పదజాలం వాడటం సమంజసం కాదని, దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే నోటీసులు జారీ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Read Also: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్